English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ కు సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!

సర్దార్ గబ్బర్ సింగ్ కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ తో సర్దార్ కు ముద్ర వేసింది. విచిత్రమేంటంటే, రెండు పాటలు ఇంకా సినిమాలో పెట్టకుండా సెన్సార్ అయిపోయిందన్న టాక్ నడుస్తోంది. నిజానికి స్విట్జర్లాండ్ లోనే పాటల్ని ఆన్ లైన్ ఎడిటింగ్ చేయించేసి పంపించేశాడు పవన్. దాంతో పెద్దగా టైం తీసుకోకుండానే, ఆ రెండు పాటల్ని మిక్స్ చేసి ఫైనల్ కాపీలో ఇంక్లూడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. లేదా పాటలకు విడిగా సెన్సార్ చేయించి ఆ తర్వాత సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ కూడా సర్దార్ టీంకు ఉంది.

సినిమాకు క్లీన్ యు ఇస్తామని, కానీ ఫైట్స్ లో వయొలెన్స్ సీన్స్ కొన్ని కట్ పడాలని బోర్డ్ చెప్పిందని తెలుస్తోంది. కానీ అసలైన కిక్కు ఫైట్స్ లోనే ఉంది కాబట్టి, కట్స్ లేకుండా, యుబైఏ సర్టిఫికెట్ తోనే బయటికొచ్చారు సర్దార్ టీం. ఏప్రిల్ 8 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న సర్దార్ కోసం ఇప్పటి నుంచీ ప్రచార కార్యక్రమాల్లో సర్దార్ టీం బిజీబిజీగా గడపబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.