English | Telugu

వందో సినిమాలో బాలయ్య కు తల్లిగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్..?

బాలయ్య వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తోంది. క్రిష్ డైరెక్షన్లో గౌతమీ పుత్ర శాతకర్ణి అన్న సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో, ఈ సినిమాలో బాలయ్య తల్లి ఎవరు అన్నదానిపై చాలా చర్చ జరుగుతోంది. గౌతమీపుత్రుడు శాతకర్ణి కాబట్టి, హీరో కంటే ముందు గౌతమి పాత్ర చాలా ముఖ్యం అంటున్నారు సినీజనాలు. మరో వైపు ఈ పాత్రకోసం బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని సంప్రదిస్తున్నారని, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మీడియాలో ఈ టాపిక్ నడుస్తున్నా, ఇది ఎంత వరకూ నిజమన్నదానిపై స్పష్టత లేదు.

పైగా సీనియర్ హీరోకి తల్లిగా, హేమమాలిని ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువే అనేది బాలీవుడ్ జనాల కథనం. ఇప్పటికీ తనను తాను యంగ్ గా చూపించుకోవడానికే 67 ఏళ్ల హేమమాలిని ట్రై చేస్తుంటారు. అందుకే ఆమెకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ డ్రీమ్ గర్ల్ అనే పేరు వచ్చింది. గతంలో ఒకే ఒక్కసారి అది కూడా 55 ఏళ్ల క్రితం పాండవవనవాసం సినిమాలో చేసిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తుందా లేదా అన్నదే ఆసక్తిని కలిగిస్తోంది. బాలయ్య వందో సినిమా గురించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 8న స్వయంగా ఆయనే అనౌన్స్ చేస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.