English | Telugu

ఏప్రెల్ నుండి సంపత్ నంది, రామ్ చరణ్ "రచ్చ"

ఏప్రెల్ నుండి సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే చిత్రం "రచ్చ" ప్రారంభం కానుంది. విషయానికొస్తే వరుణ్ సందేశ్ హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా, నిర్మించిన "ఏమైంది ఈ వేళ" చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ "రచ్చ" చిత్రానికి అంటే రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ "రచ్చ" చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తారు.

ఈ చిత్రం ఏప్రెల్ నెల నుండి సెట్స్ మీదకు రానుంది. ఈ "రచ్చ" చిత్రంలో హీరో రామ్ చరణ్ సరసన "ప్రేమ కావాలి" చిత్రం ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం కథ హీరో రామ్ చరణ్ కి చాలా బాగా నచ్చిందని సమాచారం. "రచ్చ" పేరుని సంపత్ నంది ఎప్పుడో రిజిస్టర్ చేశారు. ఈ "రచ్చ" పేరుని బోయపాటి, యన్ టి ఆర్ ల చిత్రానికి పెడుతున్నారని వినపడింది. ఈ "రచ్చ" పేరు రామ్ చరణ్ చిత్రానికి దక్కింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం