English | Telugu

సల్మాన్ ఖాన్ తో రాజమౌళి ఈగ సీక్వెల్...!

రాజమౌళికి మొట్టమొదట దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన మూవీ ఈగ. బాహుబలి కంటే ముందే, రాజమౌళి టాలెంట్ ను బాలీవుడ్ మక్కీ రూపంలో చూసి అభినందించింది. బాహుబలి భారీ హిట్ కు మక్కీ యే బేస్ వేసింది. తాజాగా రాజమౌళి ఈగ 2 తీయబోతున్నారా..? అందులో సల్మాన్ నటిస్తున్నారా..? నిజమో అబద్ధమో తెలీదు గానీ, ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఈ టాక్ నడుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సల్మాన్ భజరంగీ భాయ్ జాన్ కు స్టోరీ అందించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాతోనే సల్మాన్ విజయేంద్రప్రసాద్ ల మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. త్వరలోనే ఈగ 2 కథ రెడీ చేస్తున్నానని విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. దాంతో స్వయంగా సల్మానే, ఈగ సీక్వెల్లో నటిస్తానని అడిగాడని సమాచారం. ఎలాగూ ఇకనుంచీ రాజమౌళి సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజవుతాయి కాబట్టి, సల్మాన్ ను పెట్టి సీక్వెల్ తీసి, అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసే ఆలోచన కూడా రాజమౌళికి ఉందట. కానీ సినిమాలో సల్మాన్ ను తక్కువ సేపు ఉండే హీరోగా తీసుకుంటారా, లేక సినిమా అంతా విలన్ గా చూపిస్తూ కొత్త ప్రయోగం ట్రై చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, జక్కన్న అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.