English | Telugu

హృతిక్ రోషన్ రిలీజ్ డేట్ ప్రకటించేశాడు..!

బాలీవుడ్ లో ప్రెస్టేజియస్ గా తెరకెక్కుతోంది హృతిక్ రోషన్, అశుతోష్ గోవారికర్ మూవీ. ఆల్రెడీ గతంలో హృతిక్ తో జోథా అక్బర్ ను అశుతోష్ తెరకెక్కించాడు. ఇప్పుడు మరో చారిత్రక మూవీని తీస్తుండటం, ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సినిమా పేరు మొహంజాదారో. ఇది ఊహాజనిత చారిత్రక చిత్రం. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం, మొహంజదారో నాగరికత విలసిల్లినప్పుడు, ఆ కాలంలోని ఒక జంట మధ్య కలిగిన ప్రేమకథే ఈ మొహంజాదారో. బాహుబలిని దాటాలనే ఉద్దేశంతో చాలా భారీగా తెరకెక్కించిన మూవీ ఇది. మూడేళ్ల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసి, ఏడాదిన్నరగా షూట్ చేసి లెటెస్ట్ గా షూటింగ్ ను ముగించారు. లాస్ట్ షాట్ లో హృతిక్, అశుతోష్ కలిసి రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అశోతోష్ గోవారికరే సినిమా నిర్మాతగా వ్యవహరించాడు. హృతిక్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మొహంజదారో రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 గా ఫిక్స్ చేశారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమా తెరకెక్కడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.