English | Telugu

సాయి స‌త్తా చూపించాడు

తొలి సినిమా 'రేయ్‌' విడుద‌ల కాలేదు. అదెప్పుడొస్తుందో తెలీదు. శ్రీ‌హ‌రి అకాల మ‌ర‌ణంతో `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమా కూడా టెన్ష‌న్ పెట్టింది. దాంతో సాయిధ‌ర‌మ్‌తేజ్ ప‌రిస్థితి ఏంటి?? అని మెగా ఫ్యాన్స్ సైతం ఫీలైపోయారు. ఎట్ట‌కేల‌కు 'పిల్లా నువ్వు లేని జీవితం' విడుద‌లై మంచి టాక్ సంపాదించుకొంది. హీరోగా సాయికి మంచి మార్కులు ప‌డ్డాయి. అంతేకాదు ఈసినిమాకి క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌స్తున్నాయి. తొలి మూడు రోజుల్లోనూ రూ.5.5 కోట్లు సంపాదించుకొన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మా టీవీ శాటిలైట్ హ‌క్కుల్ని మంచి రేటుకే కొనుగోలు చేసింద‌ట‌. ఈ సినిమాతో అటు నిర్మాతలు, ఇటు బ‌య్య‌ర్లు ఇద్ద‌రూ సేఫ్ అయిపోతార‌ని బాక్సాఫీసు రిపోర్ట్స్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతున్నాయి. సాయి టాలెంట్‌, పిల్లా నువ్వు లేని జీవితం రిజ‌ల్ట్ రెండూ చూసి.. సాయిని బుక్ చేసుకోవ‌డానికి నిర్మాత‌లు కూడా రెడీ అవుతున్నారు. సాయి ఓకే అంటే.... సినిమాలు తీయ‌డానికి న‌లుగురు నిర్మాత‌లు రెడీగా ఉన్నార‌ట్ట‌. మ‌రోవైపు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా ఈనెల 27న మొద‌లైపోతోంది. మొత్తానికి సాయి ఫ‌స్ట్ లుక్‌తోనే త‌న టాలెంట్ చూపించేశాడు. మ‌రి దాన్ని ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకొంటాడో, హిట్స్‌గా ఎలా మ‌ల‌చుకొంటాడో కాల‌మే చెప్పాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.