English | Telugu

33 సంవత్సరాల తర్వాత బాబాగా విజయచందర్


సాయిబాబాగా షిర్దిసాయిమహత్య్వం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న సాయేదైవం చిత్రంలో విజయచందర్ బాబాగా నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ బాబా గుడిలో ప్రారంభమైంది. సాయిబాబా భక్తుల అనుభవాల నేపథ్యంల తీస్తున్న ఈ చిత్రంలో భక్తులకు దర్శనమిస్తూ, ఉపదేశం అందించే సన్నివేశాలను చిత్ర దర్శకుడు, నిర్మాత జి.యల్.బి. శ్రీనివాస్ చిత్రీకరించారు. విజయచందర్ బాబాగా నటించడానికి అంగీకరించడం తమ అదృష్టమని, బాబా భక్తులకు కూడా ఇది ఆనందం కలిగిస్తుందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం పతాకసన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాం. దీంతో సినిమా మోత్తం పూర్తవుతుంది. వచ్చే నెలల పాటలను విడుదల చేసి, మేల సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.