English | Telugu

రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పవన్ పార్టీ

"పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం'' అంటూ 2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన పార్టీ’ నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పార్టీతో ఇంతవరకు పోటీ చేయలేదు. పైగా ఇతర పార్టీల తరుపున ప్రచారంచేశాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లకు తన మద్దతు ప్రకటించడమే కాకుండా గత ఎలక్షన్ లో ఈ రెండు పార్టీలు విజయం సాధించడానికి మూల కారణంగా నిలిచాడు పవన్ కళ్యాణ్. సినిమా తారల్లో పార్టీ స్థాపించిన తర్వాత ఇలా చేసిన వారు ప్రపంచంలో ఎవరూ లేరనే చెప్పాలి. కాగా ఇటీవలే అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తుతం నేను కమిటైన సినిమాలు 2018 వరకు వున్నాయి.. ఈ సినిమాలు పూర్తిచేసిన వెంటనే కొంత కాలం సినిమాలకు దూరంగా వుంటాను అంటూ... 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తన రాజకీయ జీవితం వుంటందని చెప్పారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.