English | Telugu

వ‌ర్మ క‌రీంన‌గ‌ర్ లో ఏం చేయ‌బోతున్నాడు?

వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ప‌దేళ్ల త‌ర‌వాత రావ‌ల్సిన ఆలోచ‌న‌.. ఆయ‌న‌కు నిన్న సాయంత్ర‌మే వచ్చేస్తుంది. ప్ర‌తీదీ క్రియేటివిటీతో కూడిన క‌మ‌ర్షియాలిటీతో ఆలోచిస్తారాయ‌న‌. ఇప్పుడు ఆయన‌కు మ‌రో ఆలోచ‌న వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోనో, చెన్నైలోనో ఇండ్ర‌స్ట్రీ ఉండాలా..?? క‌రీంన‌గ‌ర్‌లో ఉండ‌కూడ‌దా?? అని. అందుకే ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో ఓ ఇండ్ర‌స్ట్రీ పెట్టేస్తున్నారు. న‌వంబ‌రు 18న క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌న యూనివ‌ర్సీటిలో ఓ అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించ‌బోతున్నాడ‌ట‌. ఈ స‌ద‌స్సులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చ‌ని వ‌ర్మ చెబుతున్నాడు. ''ఇండ్ర‌స్ట్రీ హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనే ఉండిపోవాల‌నుకోవ‌డం మూర్ఖ‌త్వంతో కూడిన అవివేకం. ప్ర‌పంచం ఇప్పుడు గ్లోబ‌ల్ విలేజ్ అయిపోతోంది. ఎవ‌రైనా ఎక్క‌డైనా సినిమా తీసుకోవ‌చ్చు'' అని చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రి క‌రీంన‌గ‌ర్‌లో వ‌ర్మ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.