English | Telugu

జీవితానికి గ్యారంటీ లేదు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరోలు నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). సౌత్ ఇండియాలో తెరకెక్కిన మరో అతి పెద్ద మల్టిస్టారర్ మూవీగా, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పుష్ప 2 , యానిమల్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన నేషనల్ క్రష్ 'రష్మిక'(Rashmika Mandanna)హీరోయిన్. దీంతో 'కుబేర' కి పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి 'హైదరాబాద్'(Hyderabad)లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అభిమానులని ఉద్దేశించి రష్మిక మాట్లాడుతు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంతో నాకు చాలా భయమేస్తుంది. ఈ మధ్య నేను ఎక్కువగా విమానాల్లోనే జర్నీ చేస్తున్నాను. దాంతో ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే భయం పట్టుకుంది. మన జీవితాలకి గ్యారంటీ లేదనే విషయం కూడా అర్ధమయ్యింది. ఫంక్షన్ తర్వాత మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ సినీ రంగానికి చెందిన రష్మిక 2016 లో' కిరాక్ పార్టీ' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కన్నడంలోనే అంజనీ పుత్ర, చమక్ అనే చిత్రాల్లో నటించి, 2018 లో 'నాగ శౌర్య' హీరోగా వచ్చిన 'ఛలో' మూవీతో తెలుగు నాట అడుగుపెట్టింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 , సీతారామం, వారిసు, యానిమల్, చావా వంటి చిత్రాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. దీంతో' కుబేర' పై అందరిలో అంచనాలు పెరిగాయి. క్రైమ్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన కుబేర కి 'శేఖర్ కమ్ముల'(Sekhar Kammula)దర్శకుడు. సునీల్ నారంగ్(Suniel Narang),పి రామ్మోహనరావు(p.Ram Mohan Rao)తో కలిసి శేఖర్ కమ్ముల నే నిర్మించాడు. ఈ నెల 20 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.