English | Telugu

ప్రముఖ దర్శకుడి మిస్సింగ్.. చనిపోయాడనే అనుమానం!

గుజరాత్(Gujarat)రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచివేస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 270 మంది మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన కొంతమందిని వాళ్ళ బంధువులకి అప్పగించేందుకు 'డిఎన్ఏ' పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప్రమాదం జరిగిన రోజు ప్రముఖ దర్శకుడు 'మహేష్ జీరావాలా'(Mahesh Jirawala)కనిపించడం లేదు. ఈ విషయంపై ఆయన భార్య మాట్లాడుతు 'ప్రమాదం జరిగిన రోజు మహేష్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న 'లా గార్డెన్'(Law Garden)కి వెళ్ళాడు. గురువారం మధ్యాహ్నం ఒకటి పద్నాలుగు నిమిషాలకి ఫోన్ చేశాను. మీటింగ్ అయిపోయింది, ఇంటికి బయలు దేరి వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికిరాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. విమాన ప్రమాదం జరిగిన రోజున ఆయన ఫోన్ సంఘటన స్థలికి 700 మీటర్ల దూరంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రమాదంలో ఆయన చనిపోయాడని గుర్తించడానికి మా కుటుంబ నుంచి 'డిఎన్ఏ' నమూనాలని సేకరించారు. ఎప్పుడు ఆ మార్గంలో రాడు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ మార్గాన్ని ఎంచుకొని ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 'లా గార్డెన్' కి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది.

మహేష్ జీరావాలా 2019 లో గుజరాతి భాషలో తెరకెక్కిన 'కాక్ టెల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్' అనే చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కి కూడా దర్శకత్వం వహించాడు.



ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.