English | Telugu

‘కన్నప్ప’ ట్రైలర్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేసిందా?

గత కొంతకాలంగా ఏదో ఒక రకంగా ‘కన్నప్ప’ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భక్తకన్నప్ప సినిమా గురించి అందరికీ తెలుసు. అయితే అందులో ప్రస్తావించని అంశాలు ఇందులో ఉంటాయని ఈ సినిమాకి రచయితలుగా పనిచేసినవారు చెబుతున్నారు. మరి సినిమాలో ఏం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం వివిధ భాషలకు చెందిన హీరోలను ఇందులో నటింపజేశారు. అంతవరకు బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతోంది? మంచు విష్ణు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందా అనేది చూడాలి.

జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ‘కన్నప్ప’ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందరూ ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది, ఎంత సేపు ప్రభాస్‌ కనిపిస్తాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ చూపించిన దాన్ని బట్టి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా కంటెంట్‌ విషయానికి వస్తే.. ప్రేక్షకులకు క్యూరియాసిటీని కలిగించే అంశాలు సినిమాలో అంతగా ఉన్నట్టుగా కనిపించలేదు. విజువల్‌గా, మ్యూజికల్‌గా చాలా గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ ఈ తరహాలో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే మెరుపులు మెరిపించే సినిమా కాదేమో అనే సందేహం కలుగుతుంది. ట్రైలర్‌ చూసి సినిమా గురించి ఒక అంచనాకు రావడం కంటే జూన్‌ 27 వరకు వేచి చూస్తే ‘కన్నప్ప’ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు అనేది తెలుస్తుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.