English | Telugu

ప్ర‌భాస్‌.. రానా.. డామినేషన్ ఎవ‌రిది?

రాజ‌మౌళి సినిమాల్లో భ‌యంక‌ర‌మైన ప్ర‌తినాయ‌కుల్ని చూశాం. ఆయ‌న సినిమాల్లో దాదాపుగా విల‌న్ల డామినేష‌న్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇప్పుడు బాహుబ‌లిలోనూ రానా ప్ర‌భాస్‌ని డామినేట్ చేశార‌న్న టాక్ వినిపిస్తోంది. `బాహుబ‌లి`లో ప్ర‌భాస్ కంటే రానాకే ఎక్కువ ప్రాముఖ్య‌త ఉంద‌ని, రానా ప్ర‌భాస్‌ని అన్నివిధాలా డామినేట్ చేశార‌ని చెప్పుకొంటున్నారు. దానికి తోడు ప్ర‌చార చిత్రాల్లోనూ ప్ర‌భాస్ కంటే రానానేఎక్కువ చూపిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్‌ని అడిగితే.. `ట్రైల‌ర్‌లో న‌న్ను కూడా బాగానే చూపించారు క‌దా, మీకు అలా అనిపిస్తోందా`` అంటూ లైట్ తీసుకొన్నాడు. మ‌రోవైపు రానా మాత్రం `ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియ‌న్ స్ర్కీన్‌పై ఎవ్వ‌రూ చూడ‌ని విల‌న్‌ని మీరు భ‌ళ్లాల‌దేవ‌లో చూస్తారు. రాజ‌మౌళి సృష్టించిన విల‌న్ల‌లో అతి శ‌క్తిమంతుడు భ‌ళ్లాల‌దేవ‌నే` అంటున్నాడు. దీన్ని బ‌ట్టి రానా ఆధిప్య‌తం ఈ సినిమాలో ఎంత వ‌ర‌కూ ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సినిమా విష‌యంలో డి. సురేష్ బాబు కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్నాడు. బాహుబ‌లిలో సురేష్ బాబు భాగ‌స్వామ్య‌మూ ఉంద‌న్న‌ది విశ్వస‌నీయ వ‌ర్గాల టాక్‌. అందుకే రానాని ఈ సినిమాలో బాగా ప్ర‌మోట్ చేశాడ‌ట రాజ‌మౌళి. ఈ విష‌య‌మే ప్ర‌భాస్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఇది రానా సినిమానా? ప‌్ర‌భాస్ సినిమానా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ అనుమానాలు తీరాలంటే.. జులై 10 వ‌ర‌కూ ఆగాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.