English | Telugu

మెగా హీరో 'కంచె' పూర్తి

'ముకుంద' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగాబాబు తనయుడు వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయినా.. వ‌రుణ్ మాత్రం ఓకే అనిపించుకొన్నాడు. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. టైటిల్ 'కంచె'. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. ఈ రోజు చిత్రానికి గుమ్మడికాయ్ కొట్టేశారు. 1940 కాలం నాటి క‌థ ఇది. ఇందులో వ‌రుణ్ ఓ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్‌. ప్రేమ‌, దేశ‌భక్తి క‌ల‌బోసిన ఈ క‌థ‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలూ ఉంటాయ‌ని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం తర్వాత పూరీ దర్శకత్వంలో చిత్రానికి రెడీ అవుతున్నాడు వరుణ్. జూలై 10న ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.