English | Telugu

పవన్ రిటార్డ్ అంటూ తిట్టిన రాంగోపాల్ వర్మ..!

పవన్ కళ్యాణ్ పై ఇక నుంచీ ట్వీట్ చేయను అంటూ పవన్ అభిమానులకు మాటిచ్చాడు రాంగోపాల్ వర్మ. అందుకే పవర్ స్టార్ పేరును ఉపయోగించకుండా, పవన్ పై ట్వీట్ చేశాడు. పవన్ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ తనపై చేసే ట్వీట్ల గురించి స్పందిస్తూ, వర్మ ఫ్రస్టేషన్లో ఉన్నాడంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి రెస్పాన్స్ గా వర్మ తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ పవన్ ను తిడుతున్నట్టుగా ఉంది.

ఒక ఎలివేటెడ్ సోల్ ను ఫ్రస్టేటడ్ సోల్ అని అపార్ధం చేసుకుంది ఒక రిటార్డెడ్ సోల్ అని ట్వీట్ చేశాడు. ఇవి పవన్ ను టార్గెట్ చేస్తూ అన్నవే అని అందరికీ తెలిసిందే. పవన్ పేరు ఉపయోగించను అని చెప్పిన కారణంగా, ఈ సారి పేరు ఉపయోగించకుండానే పవన్ ను రిటార్డెడ్ అని తిట్టాడు వర్మ. తన సినిమాలు తను చేసుకోక, పవన్ ను కెలకడం ఎందుకో..మళ్లీ ఇలా తిరిగి తిట్టుకోవడం ఎందుకో..ఏదేమైనా వర్మగారి శైలే వేరప్పా..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.