English | Telugu

వర్మ వీరప్పన్ సినిమాను రెండోసారి తీశాడు..!

వర్మ తన వీరప్పన్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతున్నాడు. తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన వీరప్పన్ సినిమాను ఈసారి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మన దగ్గర కిల్లింగ్ వీరప్పన్ పేరుతో రిలీజైన సినిమాలో వీరప్పన్ ను పట్టుకోవడానికి మూడు రాష్ట్రాల పోలీసులు ఎంత కష్టపడ్డారు, వీరప్పన్ ను ఎలా అంతమొందించారు అనేది తీశాడు. కానీ హిందీలో మాత్రం ఇంకా చాలా యాడ్ చేసి, అతని బయోపిక్ ను తీశాడట వర్మ గారు. సినిమాలో నటించిన టీం అంతా కిల్లింగ్ వీరప్పన్ నటులే కానీ, ఈ సినిమా దక్షిణాదిలో రిలీజ్ చేసిన సినిమాకంటే చాలా భిన్నంగా ఉండబోతోందట. టైటిల్ ను కూడా వీరప్పన్ అని పెట్టి, నో విలన్ లైక్ హిమ్ ఎవర్ ఎగ్జిస్టెడ్ (అతని లాంటి విలన్ ఎప్పుడూ లేడు) అని ట్యాగ్ లైన్ పెట్టారు. మే 27 న బాలీవుడ్ ను వీరప్పన్ పలకరించబోతున్నాడు. అదే రోజున అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ రిలీజవుతోంది. మే ద బెస్ట్ విలన్ విన్ (ఇద్దరిలో బెస్ట్ విలన్ గెలవాలి) అని ట్వీట్ చేశాడు వర్మ. సౌత్ లో మంచి రివ్యూలు సాధించిన వీరప్పన్ ను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.