English | Telugu

పోలీసోడి దర్శకుడితో మహేష్ సినిమా..!

మంచి సినిమా చూసినప్పుడు, ఆ మూవీ టీంను అభినందించడం హీరో మహేష్ కు ఉన్న మంచి అలవాట్లలో ఒకటి. లేటెస్ట్ గా పోలీసోడు ట్రైలర్ చూసిన మహేష్, ఆ మూవీ దర్శకుడు అట్లీకి ఫోన్ చేసి అభినందించాడట. అంతేకాదు, మంచి కథ ఉంటే మనిద్దరం సినిమా చేద్దామంటూ చెప్పాడట. మహేష్ కు ఇప్పటికే తెలుగులో తిరుగులేని మార్కెట్ ఉండగా, తమిళ, మళయాళ మార్కెట్స్ ను కూడా పెంచుకునే పనిలో ఉన్నాడు. శ్రీమంతుడు టైం నుంచి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. శ్రీమంతుడు రెండు భాషల్లో రిలీజయ్యింది. ఇప్పుడు బ్రహ్మోత్సవం కూడా తమిళ, తెలుగు భాషల్లో రిలీజవుతుందట. మరో వైపు మురుగదాస్ తో మరో బైలింగ్వల్ యాక్షన్ ఫిల్మ్ కోసం రెడీ అయ్యాడు మహేష్. ఆ తర్వాత అట్లీ తో సినిమా ఫైనల్ చేస్తాడని సమాచారం. పోలీసోడు రిలీజైన తర్వాత అట్లీతో సినిమాపై మహేష్ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ తో పాటు, సాంగ్స్ షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కాగా సమ్మర్ కానుకగా బ్రహ్మోత్సవాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు సూపర్ స్టార్..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.