English | Telugu

స్వచ్ఛభారత్ యాడ్ నా సినిమా కంటే వరస్ట్ గా ఉంది

వర్మకు స్వచ్ఛభారత్ కోసం వస్తున్న యాడ్స్ నచ్చలేదట. ఆయన డైరెక్షన్లో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన ఆగ్ సినిమాను బాలీవుడ్ లో అత్యంత చెత్త సినిమా అంటుంటారు విమర్శకులు. క్లాసిక్ సినిమా షోలేను ఆగ్ పేరుతో రీమేక్ చేశారు వర్మ. ఆ సినిమాకు ఆల్ మోస్ట్ ఆయన కెరీర్ బలైపోయినంత పనైంది. ఆ సినిమాతో పోలుస్తూ తన మీద తనే సెటైర్ వేసుకుంటూనే, ఆగ్ కంటే స్వచ్ఛభారత్ యాడ్స్ చెత్తగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వం తీస్తున్న స్వచ్ఛభారత్ యాడ్ ఆగ్ సినిమా కంటే వరస్ట్ గా ఉంది. ఇలాంటి సినిమాలు ఇండియాను మరింత మురికిగా చూపిస్తాయనే విషయాన్ని ఎవరైనా మోడీకి చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఏదో విధంగా న్యూస్ లో ఉండటం అలవాటైపోయిన వర్మ, ఇప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రినే టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. స్వచ్ఛభారత్ అభియాన్ ప్రోగ్రామ్ నరేంద్రమోడీ మానస పుత్రిక అన్న సంగతి తెలిసిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.