English | Telugu

'ఇంటి' ర‌హ‌స్యం బ‌య‌ట‌పెట్టిన ర‌కుల్‌..!

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఈమ‌ధ్య హైద‌రాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కొంది. రూ. కోటి రూపాయ‌లు విలువ చేసే ఆ ఇంటి చుట్టూ... ఎన్ని గాసిప్పులు పుట్టాయో.! ఆ ఇంటిని ఓ యువ హీరో ర‌కుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని పుకార్లు లేవ‌నెత్తారు. ఏకంగా కోటి రూపాయ‌ల గిఫ్ట్ ఇచ్చిన ఆ హీరో ఎవ‌ర‌బ్బా..అంటూ టాలీవుడ్ మొత్తం ఆరాలు తీసింది. దీనిపై ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్పందించింది.

''నా ఇల్లు నేనే కొనుక్కొన్నా. ఎవ‌రో కొనిస్తే నేనెందుకు తీసుకొంటా. చిన్న‌ప్ప‌టి నుంచీ క‌ష్ట‌ప‌డి సంపాదించ‌డం నా అల‌వాటు. అలా రూపాయి రూపాయి కూడ‌బెట్టి కొనుక్కొన్న ఇల్ల‌ది. నాన్న పేరుమీద లోన్ కూడా తీసుకొన్నా. కావ‌లిస్తే ఆ లోన్ పేప‌ర్లు కూడా చూపిస్తా'' అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఈ గాసిప్పులు వాళ్ల ఇంట్లోవాళ్ల వ‌ర‌కూ వెళ్లాయ‌ట‌. ర‌కుల్ గురించి తెలుసుకాబ‌ట్టి వాళ్లేం అన‌లేద‌ట‌. నాకు డ‌బ్బు విలువ తెలుస‌ని, వృథాగా ఖ‌ర్చు పెట్టే త‌త్వం కాద‌ని, అందుకే.. ఇల్లు సంపాదించుకోగ‌లిగాన‌ని అంటోంది ర‌కుల్‌. ఇల్లు కొనిపెట్టే బోయ్‌ఫ్రెండ్ ఉంటే.. కోటి రూపాయ‌ల ఇల్లేం ఖర్మ‌, నాలుగైదు కోట్ల విలువ గ‌ల ఇల్లే కొనిపెట్ట‌మ‌నేదాన్ని అంటూ జోకులు కూడా వేస్తోంది. ర‌కుల్ తాజా స్టేట్‌మెంట్‌తో ఈ ఇంటి చుట్టూ మూగిన రూమ‌ర్ల‌కు చెక్ ప‌డిన‌ట్టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.