English | Telugu

ఆ మెగా హీరోలకు బోన్స్ లేవట..!

కుర్రహీరోలందరి సరసనా నటిస్తూ, స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. మెగా హీరోలకు కూడా రకుల్ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటికే చరణ్ బ్రూస్ లీ సినిమాలో అలరించిన రకుల్, తనీ ఒరువన్ రీమేక్ లో కూడా కనిపించబోతోంది. తాజాగా అల్లు అర్జున్ సరైనోడులో బన్నీ తో చిందేసింది. ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రకుల్, తన డ్యాన్స్ సినిమా సినిమాకూ ఇంప్రూవ్ అవుతోందని చెబుతోంది. అందుక్కారణం, రీసెంట్ గా తాను వర్క్ చేసిన హీరోలేనట. బ్రూస్ లీలో రామ్ చరణ్, నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్, సరైనోడులో అల్లు అర్జున్..ఇలా అందరూ అద్భుతైమైన డ్యాన్సర్లతో వర్క్ చేయడం వలన తన డ్యాన్స్ కూడా ఇంప్రూవ్ అవుతోందట. మెగా హీరోలు చరణ్, బన్నీలకైతే అసలు ఎముకలే లేవు అన్నంతగా డ్యాన్స్ చేస్తారని కితాబిస్తోందీ భామ. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మొదలైన రకుల్ టాలీవుడ్ ప్రయాణం, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస ఆఫర్లతో బిజీ బిజీగా సాగుతోంది. అల్లు అర్జున్ తో రకుల్ నటించిన సరైనోడు 22 న థియేటర్లలో సందడి చేయబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.