English | Telugu

కూరగాయలమ్ముకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్...!

ఇదేంటి..రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు మానేసి కూరగాయలు అమ్ముకుంటుందా అని ఆశ్చర్యపోకండి. మంచు లక్ష్మి స్టార్ట్ చేసిన మేము సైతం అనే టీవీ షో కోసం రకుల్ ఈ అవతారం ఎత్తింది. కూకట్ పల్లి మంజీరా మాల్ వద్ద కూరగాయల మార్కెట్ లో నిల్చుని వీలైనన్ని కూరగాయలు సేల్ చేయడానికి ప్రయత్నించింది. స్టార్స్ రోడ్ల మీదికి వచ్చి, సామాన్య వ్యాపారులకు సహాయపడటమే ఈ షో కాన్సెప్ట్ అని సమాచారం. అలా వీళ్లు అమ్మగా వచ్చిన దాన్ని, పేదవాళ్లకు దానం చేస్తారు. త్వరలోనే జెమినీ టీవీలో రానున్న ఈ షో, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.