English | Telugu

హడావిడి లేకుండా చెక్కేస్తున్న జక్కన్న

శిల్పాన్ని చెక్కినట్టు సినిమాను చెక్కుతూ కూర్చునే సీనీ జక్కన్న రాజమౌళి, బాహుబలి రెండో భాగాన్ని మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.మొదటి పార్ట్ కు షూటింగ్ స్పాట్ లోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ ఐడీకార్డులు ఇష్యూ చేసిన జక్కన్న, ఆ సమయంలో కనీసం కొన్ని ఫొటోలయినా చూపించాడు.

ఫస్ట్ పార్ట్ అంత భారీ హిట్ అయిన తర్వాత ఇంక పబ్లిసిటీ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ, రెండో పార్ట్ కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినా, దానికి సంబంధించిన చిన్న డిటెయిల్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు..2016లో సినిమా రిలీజ్ అవుతుందని ఫస్ట్ పార్ట్ లోనే ప్రకటించేశాడు. అందుకే డెడ్ లైన్ ను మీట్ అయ్యేందుకు బాహుబలి టీం సెలవుల్లేకుండా చెమటోడుస్తున్నారు.ఫస్ట్ పార్ట్ లో కీలక సన్నివేశాల కోసం బల్గేరియా వెళ్లిన యూనిట్,రెండో పార్ట్ కోసం యు.ఎస్ వెళ్లనుండటం విశేషం..

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.