English | Telugu

త‌రుణ్‌బాబుకి బాగా త‌ల‌కెక్కింది



హ్యాట్రిక్ హీరో అని పిలిపించుకొన్నాడు రాజ్ త‌రుణ్‌! రూపాయి పెడితే... ఐదురూపాయ‌ల లాభాల్ని తీసుకొచ్చాడు. నిర్మాత‌ల పాలిట కొంగు బంగార‌మయ్యాడు. అయితే.. ఈ విజ‌యాల్ని చూసుకొని రెచ్చిపోతున్నాడు త‌రుణ్ బాబు. ఇప్పుడు అదే నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడ‌ని టాక్‌. చెప్పిన టైమ్‌కి సెట్ కి రాడ‌ని, ప్ర‌మోష‌న్ల‌కు స‌హ‌క‌రించ‌డ‌ని త‌రుణ్‌పై టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు మ‌రోటి బ‌య‌ల్దేరింది. అడ్వాన్సులు తీసుకొని... స‌ద‌రు నిర్మాత‌ల‌క కాల్షీట్లు ఇవ్వ‌డం లేద‌ని, దాంతో త‌రుణ్ చుట్టూ తిరిగి చెప్పులు అర‌గ్గొట్టుకొంటున్నార‌ని, కానీ బాబు మాత్రం ద‌య త‌ల‌చ‌డం లేద‌ని గుస‌గుస‌లాడుకొంటున్నారు. రాజ్ త‌రుణ్‌తో లేడీస్ టైట‌ర్‌కి సీక్వెల్‌గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ సినిమా చేయాల‌ని నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ప్లాన్ చేశాడు. దానికి రాజ్ త‌రుణ్ కూడా ఓకే అనేశాడు. అడ్వాన్సుకూడా పుచ్చుకొన్న త‌రుణ్‌.. ఆ త‌ర‌వాత మొహం చాటేశాడ‌ట‌. క‌థ న‌చ్చ‌లేదు, స్ర్కిప్టు మార్చండి.. అంటూ వంక‌లు పెడుతున్నాడ‌ట‌. ఆల్రెడీ ఈ సినిమాపై ఇప్ప‌టికే రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టిన శ్రీ‌ధ‌ర్‌.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెగ ఇదైపోతున్నాడ‌ట‌. ఇద‌నే కాదు, ఇప్ప‌టి వ‌ర‌కూ ముగ్గురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులు తీసుకొన్న త‌రుణ్‌.. అంద‌రితోనూ ఇలానే ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, రాజ్ త‌రుణ్ త‌ల‌తిక్క వైఖ‌రితో చాలా న‌ష్ట‌పోతున్నామ‌ని నిర్మాత‌లు ఫీల‌వుతున్నారు. మ‌రి బాబుకి ఈ కిక్కు ఎప్పుడు దిగుతుందో ఏమిటో?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.