English | Telugu

పూరీకి ఓకే చెప్పిన మహేష్..!

మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి' అప్పట్లో ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఆతరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ కూడా మంచి హిట్టైంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పని చేయబోతున్నారట. ఇటీవల ఓ సందర్బంలో మహేష్ ని కలిసిన పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టు వినిపించాడట. దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ సినిమాకి రెడీ అవుతుండగా, పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత వీరి సినిమా ప్రారంభం అవుతుందట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.