English | Telugu

పూరి - నితిన్‌... డిష్యూం డిష్యూం?

నితిన్ సినిమా ఆగిపోయిన త‌ర‌వాత‌ పూరి జ‌గ‌న్నాథ్‌కి కంటిమీద కునుకు ఉంటుందో, లేదో..? ఎందుకంటే.. వ‌రుస‌గా ఆయ‌న‌కు అన్నీ త‌ల‌నొప్పులే ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు.. చిరు 150వ సినిమా ఉంటుందా, ఊడుతుందా అనే టెన్ష‌న్ ప‌ట్టుకొంది. త‌న సినిమాల విష‌యంలో ఛార్మి విప‌రీతంగా జోక్యం చేసుకొంటోంద‌న్న టాక్‌బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు నితిన్ వైపు నుంచి కూడా పూరి ఒత్తిడికి గుర‌వుతున్నాడు.

నితిన్ సినిమా విష‌యంలో సుధాక‌ర్ రెడ్డి నుంచి పూరి అడ్వాన్సుగా రెండో కోట్ల రూపాయ‌లు తీసుకొన్న‌ట్టు వినికిడి. ఇప్పుడా రెండు కోట్లు వెన‌క్కి ఇవ్వ‌మ‌ని నితిన్ ఒత్తిడి తీసుకొస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు పూరి 'చూద్దాం, చేద్దాం' అని కాల‌యాప‌న చేస్తున్న‌ట్టు, ఈ విష‌యంలో నితిన్ ద‌ర్శ‌కుల సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఛార్మిపై సుధాక‌ర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.

'డ‌బ్బులు లేక‌పోవ‌డం వ‌ల్లే నితిన్ సినిమా ఆడిపోయింద‌'న్న త‌ప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వ‌డం వల్ల త‌న ప‌రువు పోయింద‌ని, ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత‌ల మండ‌లి ఛార్మిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ హ‌గ్గులిచ్చుకొని ఫొటోల‌కు పోజులిచ్చిన పూరి - నితిన్‌ల మ‌ధ్య ఇప్పుడు గంభీర‌మైన వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. మ‌రి చివ‌రికి ఈ క‌థ ఎలా ముగుస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.