English | Telugu

ప్రభాస్ ఎన్నారై అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా..?

ప్రభాస్ ఒక ఎన్నారై అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా..? ఆ అమ్మాయితో పెళ్లికి ఇంట్లో వాళ్లను ఒప్పించాడా..? త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడా..? ఒక లీడింగ్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్లో వచ్చింది ఈ న్యూస్. దాంతో జనాలు ఇదేందిరో కొత్తగా ఉంది అనుకున్నారు. ఇప్పటికే బాహుబలికి పెళ్లి సెట్టయిందన్నారు కదా. మళ్లీ కొత్తగా ఈ ఎన్నారై నేహ ఎవరబ్బా అని అందరికీ డౌట్స్ వచ్చేశాయి. పూర్తిగా చదవకపోతే ఈ డౌట్స్ అలాగే ఉండిపోతాయి. నేహా సౌతాఫ్రికాలో సెటిలైన ఎన్నారై అని, బాహుబలి హిట్టైన తర్వాత ఆమెకు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడని, ఇంకా ఏవేవో రాసుకొచ్చింది ఆ పేపర్. ఆ ఆర్టికల్ అంత ఎగ్జైటింగ్ గా చదువుతూ చివరికి వచ్చేసరికి ఓహో ఇదా మ్యాటరు అని అనుకున్నారు జనాలు. ఎందుకంటే అది ఏప్రిల్ ఫూల్ న్యూస్ అట. ఈ న్యూస్ చదివిన తర్వాత చాలామందికి హార్ట్ బ్రేక్ అవుతుంది. అయినప్పటికీ ప్రభాస్ కపుల్ కు వియ్ విష్ హ్యాప్ లైఫ్ ఎహెడ్ అని రాసి, మా రీడర్స్ కు కూడా హ్యాపీ ఫూల్స్ డే అని ముగించింది. కానీ ఇక్కడ ఫూల్ అయింది పేపర్ మీద నమ్మకంతో చదివిన వాళ్లా..? నమ్మి చదువుతున్న వాళ్లను ఫూల్ చేద్దాం అనుకున్న వాళ్లా..? అన్నదే అసలు డౌటు..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.