English | Telugu

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

అభిమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎప్పుడూ చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్ వీరాభిమాని నితన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అంతకు ముందు ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నితిన్ ప్రకటించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.