Read more!

English | Telugu

రామ్ చరణ్ తండ్రిగా పోసాని

రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన పోసాని కృష్ణమురళి డైరీలో ఇప్పుడు ఖాళీ అన్న మాట లేదు. ముఖ్యంగా టెంపర్ సక్సెస్ తర్వాత, పోసాని కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో ఆయన కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తనీ ఒరువన్ రీమేక్ లో చెర్రీ తండ్రిగా పోసాని ఫిక్స్ అయ్యాడని సమాచారం.

ఇప్పటికే సురేందర్ రెడ్డి రేసుగుర్రంలో హోం మినిస్టర్ గా, రామ్ చరణ్ నాయక్ లో రౌడీ షీటర్ గా నవ్వులు పూయించాడు పోసాని. ఇప్పుడు చెర్రీ-సూరి కాంబినేషన్లో కూడా పోసానిని తీసుకోవడం విశేషం. తనీ ఒరువన్ లో తండ్రి పాత్రలో నటించిన తంబి రామయ్యకు మంచి మార్కులే పడ్డాయి. మరిప్పుడు పోసాని ఈ పాత్రను ఏ మేరకు రక్తి కట్టిస్తారో చూడాలి. ఈ సినిమాకు రక్షక్ అనే పేరును పరిశీలిస్తున్నారని టాక్.