English | Telugu

రామ్ చరణ్ తండ్రిగా పోసాని

రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన పోసాని కృష్ణమురళి డైరీలో ఇప్పుడు ఖాళీ అన్న మాట లేదు. ముఖ్యంగా టెంపర్ సక్సెస్ తర్వాత, పోసాని కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో ఆయన కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తనీ ఒరువన్ రీమేక్ లో చెర్రీ తండ్రిగా పోసాని ఫిక్స్ అయ్యాడని సమాచారం.

ఇప్పటికే సురేందర్ రెడ్డి రేసుగుర్రంలో హోం మినిస్టర్ గా, రామ్ చరణ్ నాయక్ లో రౌడీ షీటర్ గా నవ్వులు పూయించాడు పోసాని. ఇప్పుడు చెర్రీ-సూరి కాంబినేషన్లో కూడా పోసానిని తీసుకోవడం విశేషం. తనీ ఒరువన్ లో తండ్రి పాత్రలో నటించిన తంబి రామయ్యకు మంచి మార్కులే పడ్డాయి. మరిప్పుడు పోసాని ఈ పాత్రను ఏ మేరకు రక్తి కట్టిస్తారో చూడాలి. ఈ సినిమాకు రక్షక్ అనే పేరును పరిశీలిస్తున్నారని టాక్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.