English | Telugu

ప్రేయసి కోసం టోరంటో వరకూ...

బాలీవుడ్ బాజీరావ్ రణ్ వీర్ సింగ్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. అందుకు కారణం లేకపోలేదు. రణ్ వీర్ మాటలు చేతలు నాకు కూడా ఇలాంటి లవర్ ఉండాలి అని అమ్మాయిలు కోరుకునేలా ఉంటాయి. తాజాగా, అలాంటి పనే ఇంకొకటి చేశాడు ఈ కండల వీరుడు. తన ప్రేయసి దీపికా పడుకునే తో వాలెంటైన్స్ డే ను స్పెండ్ చేయడం కోసం, ఆమెకు సర్ ప్రైజ్ ఇస్తూ టోరంటో లో వాలిపోయాడు. అక్కడ ఒక ఫ్యాన్ రణ్ వీర్ తో సెల్ఫీ తీసుకుని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టడంతో, విషయం బయటికి వచ్చింది.

ఇప్పటికే దీపిక రణ్ వీర్ లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే..లవర్ ను వదిలి కొన్ని రోజులు కూడా ఉండలేకపోతున్నాడు అంటూ బాలీవుడ్ జనాలు కిసుక్కుమంటున్నారు.. అతని లేడీ ఫ్యాన్స్ మాత్రం హౌ స్వీట్ అంటూ రణ్ వీర్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ లో తన మొదటి సినిమా ' xXx : ది రిటర్న్ ఆఫ్ ది గ్జాండర్స్ ' షూటింగ్ కోసం దీపికా పదుకునే కొద్ది రోజుల క్రితం టోరంటో వెళ్లిన సంగతి తెలిసిందే..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.