English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా నీలకంఠ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, విలక్షణ విభిన్న దర్శకుడు నీలకంఠ ఒక మూవీ చేయబోతున్నారట. వివరాల్లోకి వెళితే నీలకంఠ తను తొలిసారిగా దర్శకత్వం వహించిన "షో" చిత్రంతోనే జాతీయ స్థాయిలో అవార్డ్ పొందిన దర్శకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కా కమర్షియల్ హీరో. మరి వీళ్ళిద్దరికీ పొత్తెలా కుదురుతుంది...? అంటే నీలకంఠ మిస్సమ్మ, నందననం 120 కి.మీ, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న "విరోధి" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "విరోధి" నక్సలిజం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో నిర్మించబడుతున్న చిత్రం.

ఇదిలా ఉంటే దర్శకుడు నీలకంఠ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక కథ చెప్పారట. ఆ కథ ఆయనకి చాలా బాగా నచ్చిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతూందనీ సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "తీన్‍ మార్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత "ది షాడో" చిత్రలోనూ, ఆ తర్వాత "గబ్బర్ సింగ్" చిత్రంలోనూ నటించిన అనంతరం నీలకంఠ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. నీలకంఠ వంటి ఒక ఆర్ట్ ఫిలింస్ తీసే దర్శకుడు, పవన్ కళ్యాణ్ వంటి ఒక కమర్షియల్ హీరో కలసి చేసే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.