English | Telugu

ఎన్టీఆర్‌కు షాకిచ్చిన బాలీవుడ్ భామ‌

ఎన్టీఆర్ సినిమా అంటే ఏక‌థానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. కాల్షీట్లు ఎన్ని కావాలీ... అంటూ తొంద‌ర‌పెడుతుంది. అయితే ఇదంతా ఇక్క‌డ‌. బాలీవుడ్ లో అంత సీన్ లేద‌ని ప‌రిణీతీ చోప్రా నిరూపించింది. ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తారా అని అడిగితే ''అబ్బే సౌత్ ఇండియ‌న్ సినిమాల‌పై నాకంత ఇంట్ర‌స్ట్ లేదు.. చేయాల‌నీ లేదు. నిజానికి అంత టైమ్ లేద‌''ని గొప్ప‌లు పోతోంది.

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి జ‌న‌తా గ్యారేజ్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ ప‌రిణీతీ చోప్రాని ఎంచుకొన్నార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ప‌రిణీతీ మాత్రం ఈ ఆఫ‌ర్ ఒప్పుకోలేద‌ట‌. `బాలీవుడ్‌లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నా.. ఇప్పట్లో సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌లేను` అని తేల్చి చెప్పేసిన‌ట్టు టాక్‌. దాంతో.. చిత్ర‌బృంతం గ‌తుక్కుమంద‌ట‌. ఎన్టీఆర్ సినిమా అంటే ఎగురుకొంటూ వ‌స్తుంద‌నుకొంటే.. అంత షాక్ ఇచ్చిందేంటి??? అంటూ షాకైపోతున్నారు.

ఇక్క‌డే ఖాళీగా ఉన్న ఏ స‌మంత‌నో, కాజ‌ల్‌లో వెదుక్కొంటే స‌రిపోతుంది లే అని డిసైడ్ అయ్యార‌ట‌. ఒక‌ట్రెండు రోజుల్లో క‌థానాయిక ఎంపిక‌పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.