English | Telugu

నాగ్ వంట‌.. స‌మంత తెగ తింటోంది

హీరోయిన్లంటే.. నోరు క‌ట్టేసుకొని, తిండీ తిప్ప‌లు లేక అల్లాడిపోతార‌నుకొంటుంటాం. అయితే.. స‌మంత మాత్రం అట్టా కాద‌ట‌. దొరికింది దొరికిన‌ట్టు తెగ తింటుంద‌ట‌. ఈమ‌ధ్య స‌మంత‌కి చేప‌లంటే మ‌రీ మ‌రీ ఇష్టం ఏర్ప‌డిపోయింద‌ట‌. అదీ... `ఎన్ గ్రీల్‌` లో వండిన చేప‌. ఎన్ గ్రిల్ అంటే తెలుసు క‌దా..?? నాగార్జున‌దే ఈ హోటెల్‌. ఓసారి.. స‌మంత‌కు ఎన్ గ్రిల్ నుంచి చేప‌ల్ని పంపాడ‌ట‌. అది తిన్న స‌మంత ఫ్లాట్ అయిపోయింద‌ట‌. అప్ప‌టి నుంచి స‌మంత ఎప్పుడు హైద‌రాబాద్‌లో ఉన్న ఎన్ గ్రిల్ నుంచి చేప‌లు రావాల్సిందే న‌ట‌. స‌మంత లంచ్‌లో చేప‌లు మ‌స్ట్ అండ్ షుడ్ అట‌. ఈ చేప‌ల కూర ఖ‌రీదు దాదాపుగా రూ.4 వేల‌ని తెలుస్తోంది. ఏ సినిమా చేస్తుంటే ఆ సినిమా నిర్మాత ఈ బిల్ భ‌రించాల‌ట‌. తాను తిన‌డ‌మే కాకుండా. త‌న ఫ్రెండ్స్‌కి కూడా ఎన్ గ్రిల్ రుచుల్ని ప‌రిచ‌యం చేస్తోందట‌. వాళ్లంతా వారెవ్వా స‌మంత‌... ఏం టేస్టు నీది అంటూ కితాబుల మీద కితాబులు ఇస్తున్నార‌ట‌. ఈ ఖ‌ర్చు భ‌రిస్తున్న నిర్మాత‌లు మాత్రం... మింగ‌లేక క‌క్క‌లేక‌.. బేర్ మంటున్నార‌ని టాలీవుడ్ టాక్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.