English | Telugu

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు వచ్చేశాడు

స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో యంగ్ టైగర్ చేస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా కాంబినేషన్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో, సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలెట్టిన జనతా గ్యారేజ్ టీం, మోహన్ లాల్ పార్ట్ ను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈరోజు నుంచి ముంబైలో మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు ఉండబోతోందని సమాచారం. సినిమాకు కీలకమైన సీన్స్ అన్నీ, మెయిన్ స్టార్ క్యాస్ట్ తో ముంబైలో తెరకెక్కించనున్నారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న జనతాగ్యారేజ్ ను శ్రీమంతుడు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.