English | Telugu

షూటింగ్ పూర్తి చేసుకున్న నితిన్ త్రివిక్రమ్ సినిమా..!

నితిన్ సమంతల కాంబినేషన్లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా అ..ఆ నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో ప్రకటించాడు నితిన్. అ..ఆ షూటింగ్ పూర్తైపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలి. ఈ సినిమా టీం ను చాలా మిస్ అవుతాను అని ట్వీట్ చేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో, అఆ పై మంచి అంచనాలున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ నెల 26న మూవీ ఆడియోను రిలీజ్ పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు మూవీ టీం. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించిన అ..ఆ ను మే లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.