English | Telugu

మా అబ్బాయికి నేను అపకారం చేశాను 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)జూన్ 12 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. పవన్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో పాటు, పోరాట యోధుడు గా పవన్ చేస్తుండటంతో వీరమల్లు పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్య మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత ఏఏం రత్నం(Am rathnam)వీరమల్లు ని నిర్మించగా, ఆయన తనయుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకుడిగా వ్యవహరించాడు.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన 'అసుర హననం' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో నిర్మాత ఏఏం రత్నం మాట్లాడుతు' వేదాళం సినిమాని కళ్యాణ్ గారు మా అబ్బాయి డైరెక్షన్ లో తెరకెక్కిద్దామని చెప్పారు. కానీ జ్యోతి కృష్ణ అప్పుడు ఆక్సిజన్ సినిమాని డైరెక్ట్ చేస్తు బిజీగా ఉన్నాడు. దాంతో కళ్యాణ్ గారు ఇచ్చిన ఆఫర్ ని జ్యోతి కృష్ణకి చెప్పలేదు. ఒక విధంగా తనకి నేను అపకారం చేసినట్టు. మా అబ్బాయి అని చెప్పడం కాదు, వీరమల్లు బాగా రావడం కోసం ఎన్నో రాత్రులు నిద్రమానుకొని ఎంతో తపనతో జ్యోతికృష్ణ తెరకెక్కించాడు. మా అబ్బాయి డైరెక్షన్ చూసి కళ్యాణ్ గారే ఎంతో ఆశ్చర్యపడ్డారని చెప్పుకొచ్చాడు.

హీరోయిన్ నిది అగర్వాల్(Nidhhi Agerwal)తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani)దర్శకుడు జ్యోతికృష్ణ తదితరులు కూడా సినిమాకి సంబంధించిన పలు ఆసక్తి కర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు సందడి చేయనుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.