English | Telugu

టాప్ 5 లోకి చేరుకున్న ఊపిరి..!

కింగ్ నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ ఊపిరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ హిట్ నుంచి ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా ఓవర్సీస్ లో దూసుకుపోతోంది ఊపిరి. ఫ్రెంచి సినిమా ఇంటచిబుల్ప్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటినుంచే పాజిటివ్ బజ్ ఉండటం ప్లస్ అయింది. క్లాస్ సినిమాలకు ఓవర్సీస్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అదే కోవలో నాగార్జున ఊపిరి కూడా చేరింది. ట్రేడ్ పండితుల ప్రకారం, అమెరికాలో ఆల్ టైం హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో ఊపిరి కూడా చేరింది. 1.6 మిలియన్ డాలర్లతో బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది సినిమాల తర్వాతి స్థానంలో ఊపిరి నిలిచింది. ఇప్పటి వరకూ ఓవర్సీస్ లో నాగార్జున సినిమాల్లో అత్యధిక కలెక్షన్ కూడా ఊపిరిదే. కేవలం వీల్ చైర్ కే అతుక్కుపోయిన మిలియనీర్ పాత్రలో నాగ్ తనలోని నటుడ్ని ఆవిష్కరిస్తే, సరదా కుర్రాడిలా కార్తి అలరించాడు. మరి కొన్ని రోజుల పాటు, యుఎస్ లో ఊపిరి డ్రీమ్ రన్ కంటిన్యూ అవతుందని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు. అది జరిగితే, ఊపిరి టాప్ 3 లోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.