English | Telugu

నాగ్ రేంజ్ పెరిగిపోయింది


అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా ద‌శాబ్దాల నుంచీ ప్ర‌యాణం సాగిస్తున్నాడు అక్కినేని నాగార్జున. నాగ్ కెరీర్ లో హిట్లూ, సూప‌ర్ హిట్లూ చాలా ఉన్నాయి. కానీ న‌వ‌త‌రం అడుగుపెట్టాక‌... వాళ్ల‌కు ధీటుగా నాగ్ వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయాడు. నాగ్ సినిమా కనీసం రూ.30 కోట్ల మైలు రాయిని కూడా చేరుకోలేక‌పోయింది. రూ.20 కోట్లు వ‌చ్చాయంటే నాగ్ సూప‌ర్ హిట్ కొట్టిన‌ట్టే. ఈనాటి క్లాసిక్ అనిపించుకొన్న మ‌నం కూడా రూ.30 కోట్ల మైలు రాయి ద‌గ్గ‌రే ఆగిపోయింది. అయితే.. సోగ్గాడే చిన్ని నాయిన మాత్రం నాగార్జున‌లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ 35 కోట్లు సాధించి.. నాగ్ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.15 కోట్ల‌లోపే. అంటే రెట్టింపు లాభాల్ని ఆర్జించింద‌న్న‌మాట‌. సినిమాలో విష‌యం ఉండ‌డం ఒక‌టైతే, సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం, ఫ్యామిలీ సినిమాగా కితాబులు అందుకోవ‌డం.. సోగ్గాడికి బాగా క‌లిసొచ్చింది. ఈసినిమాతో నాగ్‌.. రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్న నాగ్‌ని చూసి `నాగ్ ప‌నైపోయింది` అనుకొన్నారంతా. కానీ మ‌నం, సోగ్గాడేతో నాగార్జున ఫామ్‌లోకి వ‌చ్చేశాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.