English | Telugu
కన్నప్ప నుంచి.. భరణి వాకౌట్?
Updated : Jan 29, 2016
మిథునం తరవాత తనికెళ్ల భరణి మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. ఆయన ఈలోగా కన్నప్ప అనే కథ రెడీ చేసుకొన్నారు. ముందుగా సునీల్కి వినిపించారు. ఆయన ఒకే అన్నాడు. అయితే డేట్లు క్లాష్ రావడంతో... ఈ కథ విష్ణు వరకూ వెళ్లింది. రూ.50 కోట్ల వ్యయంతో.. హాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని విష్ణు డిసైడ్ అయ్యాడు. ఈయేడాది ఏప్రిల్లో ఈ సినిమా ఉంటుందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమా నుంచి తనికెళ్ల భరణి అర్థాంతరంగా వాకౌట్ చేశారని టాక్. దాంతో కన్నప్ప ప్రాజెక్ట్ ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భరణి మరో హీరోని వెదికిపట్టుకొంటారా? లేదంటే... విష్ణునే మరో దర్శకుడితో ఈ సినిమా లాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.