English | Telugu

క‌న్న‌ప్ప నుంచి.. భ‌ర‌ణి వాకౌట్‌?

మిథునం త‌ర‌వాత త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకోలేదు. ఆయ‌న ఈలోగా క‌న్న‌ప్ప అనే క‌థ రెడీ చేసుకొన్నారు. ముందుగా సునీల్‌కి వినిపించారు. ఆయ‌న ఒకే అన్నాడు. అయితే డేట్లు క్లాష్ రావ‌డంతో... ఈ క‌థ విష్ణు వ‌ర‌కూ వెళ్లింది. రూ.50 కోట్ల వ్య‌యంతో.. హాలీవుడ్ సాంకేతిక ప్ర‌మాణాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని విష్ణు డిసైడ్ అయ్యాడు. ఈయేడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమా నుంచి త‌నికెళ్ల భ‌ర‌ణి అర్థాంత‌రంగా వాకౌట్ చేశార‌ని టాక్‌. దాంతో క‌న్న‌ప్ప ప్రాజెక్ట్ ఆగిపోయిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భ‌ర‌ణి మ‌రో హీరోని వెదికిప‌ట్టుకొంటారా? లేదంటే... విష్ణునే మ‌రో ద‌ర్శ‌కుడితో ఈ సినిమా లాగిస్తారా అనేది ప్రశ్నార్థ‌కంగా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.