English | Telugu

రామ్ చరణ్ రిలీజ్ చేస్తున్నాడు..

తమిళ్ లో ఇప్పటి వరకూ రాని జాంబీ ( నడుస్తున్న శవాలు ) కాన్సెప్ట్ తో తెరకెక్కిన ' మిరుతన్ ' సినిమా తెలుగులో ' యమపాశం ' పేరుతో రాబోతోంది. జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం తమిళుల నోట నానుతోంది. సరికొత్త జాంబీ జానర్ లో కథాంశాన్ని తెరకెక్కించడమే అందుక్కారణం..వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తెలుగు ఆడియోను రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నారు.

శక్తి సౌందర్ రాజన్ తీసిన ఈ జాంబీ మూవీ, ఈ జానర్ లో ఇండియాలోనే రెండోది కావడం విశేషం. మొదటిది గో గోవా గాన్ పేరుతో సైఫ్ అలీఖాన్ హీరోగా వచ్చింది. రాక్ ది షాదీ పేరుతో మరో జాంబీ సినిమా తెరకెక్కినా రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో మాత్రమే ఈ తరహా చిత్రాలు వచ్చేవి. ఒక వైరస్ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే జాంబీ కథాంశం. హాలీవుడ్ వాళ్లకు ఇవి రొటీన్ అయిపోయినా, ఇండియాకు మాత్రం ఇవి కొత్తే..ఈ బైలింగ్వల్ మూవీ, సౌత్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.