English | Telugu

మెగాస్టార్ కుమార్తె శ్రీజ భర్త మీద వరకట్నం కేసు

మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త శిరీష్ భరద్వాజ మీద వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడని సి సి యస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే మూడేళ్ళ క్రితం తండ్రి ప్రముఖ సినీ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు, మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి చిన్నకుమర్తె శ్రీజ తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ కోసం తన కుటుంబాన్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ పాప జన్మించిన సందర్భంలో మెగాస్టార్ కుటుంబం శ్రీజను దగ్గరకు తీసింది. ఆ తర్వాత ఇటీవల గత కొంత కాలంగా మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త నుంచి దూరంగా ఉంటోందని తెలిసింది.

నిన్న అంటే మార్చ్ 14 వ తేదీన, మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని సి సి యస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయాన్ని ముందుగా లైట్ గా తీసుకున్నారు. కానీ మెగాస్టార్ కుమార్తె శ్రీజ ఒక సీల్డ్ పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఆ సీల్డ్ కవర్ లో ఏముందనేది ఇంకా తెలియలేదు. ఈ వార్త రాత్రి 8 గంటల వరకూ శాటిలైట్ ఛానల్స్ లో మారుమ్రోగినా, 9 గంటల తర్వాత ఎందుకనో అన్ని ఛానల్స్ ఒక్కసారిగా ఈ వార్తను ఆపేశాయి. మెగాస్టార్ తరపున అలా ఈ వార్త ప్రచారం కాకుండా మేనేజ్ చేసి ఉంటారని సినీజనం అంటున్నారు. ఏది ఏమైనా వరకట్నం వేధింపుల సమస్య అనేది సాధారణ ఆడపిల్లకైనా, మెగాస్టార్ కూతురుకైనా సమానమేనని ఈ సంఘటనతో మరో సారి రుజువయ్యింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.