English | Telugu

షార్జా టి20 మ్యాచ్‌లో మెగాస్టార్‌.. వైరల్‌ అవుతున్న వీడియో!

2025 ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20 యుఎఇలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్‌ కేపిటల్స్‌, షార్జా వారియర్స్‌కి మధ్య జరిగిన మ్యాచ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. శుక్రవారం షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో చిరంజీవి సందడి చేశారు. అక్కడి అభిమానులు మెగాస్టార్‌కి ఘనస్వాగతం పలికారు. ఐసిసి డైరెక్టర్‌ ముబాషిర్‌ ఉస్మానీ, జిఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి ఈ మ్యాచ్‌ చూశారు మెగాస్టార్‌. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20 తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.