English | Telugu

మెగాస్టార్ చేయి జారి ప్రియాంక చోప్రా చేతికి చేరింది..!

ఇంక్రెడిబుల్ ఇండియా అన్న నినాదాన్ని దేశ విదేశాల్లో ఉన్న విదేశీయులకు వినిపించాలంటే, అందుకు భారతదేశం తరపున చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తి కావాలి. మొత్తం దేశ ప్రతిష్ట తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఈ రోల్ చాలా ముఖ్యమైనది, గర్వకారణమైంది. గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ ఈ బ్రాండ్ ను బాగా నిలబెట్టాడు. ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ యాడ్ క్యాంపెయిన్లు చేశాడు. కానీ భారతదేశంలో అసహనం గురించి కాస్త టంగ్ స్లిప్ అవడంతో, ఈ గౌరవ హోదా కూడా అమీర్ నుంచి స్లిప్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లెజండ్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెడదామనుకున్నారు మోడీ. ఆయనకు బిగ్ బీ వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. ఈలోపే పనామా పేపర్స్ లీక్ కావడం, వాటిలో బిగ్ బీ పేరుండటంతో ఆయన్ను కూడా పక్కకు పెడుతున్నారట. దేశ విదేశాల్లో అవార్డులు అందుకుంటూ, రీసెంట్ గా పద్మశ్రీని స్వీకరించిన ప్రియాంక చోప్రా అయితే, ఇండియా బ్రాండ్ కు కరెక్ట్ గా ప్రాతినిథ్యం వహించగలదని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోందట. అంతేకాక, ఇంక్రెడిబుల్ ఇండియాను అత్తుల్య భారత్ గా మార్చే ఆలోచన కూడా భారత ప్రభుత్వానికి ఉందట. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.