English | Telugu
రాయబారి వెనుక రహస్యం
Updated : Feb 16, 2016
కంచె తరవాత క్రిష్ - వరుణ్తేజ్ మరోసారి కలిసి ఓ సినిమా చేద్దామనుకొన్నారు. రాయబారి పేరుతో ఓ స్ర్కిప్టు కూడా రెడీ అయ్యింది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవ్వాల్సింది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. షూటింగ్ లొకేషన్లు దొరకలేదు.. అందుకే.. ఈ సినిమాని ఆపేశాం అని చిత్రబృందం తెలిపింది. అయితే.. రాయబారి వెనుక మరో రహస్యం ఉందట. అదేంటంటే... ఈ కథకి మరీ భారీ బడ్జెట్ కావాలట. కంచెకి రూ.18 కోట్లే వచ్చాయి. లోఫర్కి అందులో సగం కూడా రాలేదు. ఇప్పుడు రాయబారికి కనీసం 25 కోట్ల పెట్టుబడి అయినా పెట్టాల్సిందే. కానీ వరుణ్ మార్కెట్ ఇంకా అంత స్థాయికా రాలేదు. సో... రాయబారి అనేది రిస్కీ ప్రాజెక్టుగా మారిందిప్పుడు. అందుకే క్రిష్ ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నాడని తెలుస్తోంది. ఈలోగా వరుణ్కి ఓ మంచి హిట్టు పడితే.. అప్పుడు రాయబారిని పట్టాలెక్కించొచ్చన్నది క్రిష్ ఆలోచన. బడ్జెట్ లేకపోవడం వల్లనే ఈ సినిమా ఆడిపోయిందన్నది అసలు నిజం. మరి దీనిపై క్రిష్ ఏమంటాడో చూడాలి.