English | Telugu

మ‌ళ్లీ విష్ణు ''ఢీ'' కొట్ట‌బోతున్నాడు



మంచు విష్ణు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా.. 'ఢీ'. ఆ సినిమా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సృష్టించింది. విల‌న్ ఇంట్లో హీరో దూరి.. అక్క‌డ త‌మాషాలు చేయ‌డం, మైండ్ ప్లే న‌డిపించడం ఇలాంటి క‌థ‌లు ఢీతో ఊపందుకొన్నాయి. విష్ణు కామెడీ బాగా చేయ‌గ‌లడ‌ని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విష‌యాన్ని విష్ణు ధృవీక‌రించాడు కూడా. ఆల్రెడీ 'ఢీ 2'కి సంబంధించిన క‌థ సిద్ధ‌మైందట‌. వ‌చ్చే యేడాది లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ ''నాలోని కామెడీ యాంగిల్ ట‌చ్ చేసిన సినిమా ఢీ. ఆ సినిమాని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. దాని కొన‌సాగింపు క‌థ‌గా ఓ స్ర్కిప్ట్ సిద్ధ‌మైంది. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాని టేక‌ప్ చేసే అవ‌కాశాలున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు చెబుతా'' అన్నారాయ‌న‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన 'ఎర్ర‌బ‌స్సు' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.