English | Telugu

మ‌హేష్ త‌న టార్గెట్ రీచ్ అవుతాడా??

బ్లాక్‌బస్ట‌ర్ హిట్ కొట్ట‌డం మ‌హేష్ బాబుకి కొత్త కాదు. కానీ.. ఇప్పుడు మాత్రం అత్య‌వ‌స‌రం. ఎందుకంటే వ‌రుస‌గా రెండు ఫ్లాపుల‌తో అభిమానుల్ని నిరాశ ప‌రిచాడు. ఈసారి మాత్రం గురి త‌ప్ప‌కూడ‌ద‌న్న అప్ర‌మ‌త్త‌త‌తో శ్రీ‌మంతుడు చేశాడు. మార్కెట్ వ్యూహాల్ని బాగానే ఒంట‌బ‌ట్టించుకొన్న మ‌హేష్ ఈ సినిమాని త‌మిళంలోనూ భారీ ఎత్తున విడుద‌ల చేశాడు. నిర్మాణ భాగ‌స్వామి కావ‌డంతో ద‌గ్గ‌రుండి ప్ర‌చారం చేశాడు. న‌మ్ర‌త కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేసింది. క‌థ‌లో లోపాలున్నా, సినిమా స్లోగా `సాగినా` తొలి రోజు హిట్ టాక్ ద‌క్కించుకోగ‌లిగింది. సినీ సెల‌బ్రెటీలు శ్రీ‌మంతుడుని ఆహా... ఓహో అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డిపోయిన‌ట్టే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. తొలి రోజు రూ.15 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింద‌ని టాక్‌.

మ‌హేష్ టార్గెట్ మాత్రం వంద కోట్లు. త‌న కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమాగా శ్రీ‌మంతుడుని నిల‌పాల‌న్న ధ్యేయంతో ఉన్నాడు. సినిమా ఎలాగూ హిట్ట‌య్యింది, దానికి తోడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో పెద్ద సినిమా రావాలంటే క‌నీసం రెండు వారాలు ప‌డుతుంది. ఈ లోగా వ‌సూళ్లు ద‌క్కించుకోగిలిగితే.. వంద కోట్ల మైలు రాయి అందుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. పైగా ఇది ఫ్యామిలీ ఓరియోంటెడ్ స‌బ్జెక్ట్‌.
కుటుంబ ప్రేక్ష‌కులు క‌ల‌సి క‌ట్టుగా వ‌స్తే.. ఈసినిమాని వంద కోట్ల క్ల‌బ్‌లో చూడొచ్చు.

అయితే బీసీ సెంట‌ర్ల‌లో ఈ సినిమా ఎంత వ‌ర‌కూ ఎక్కుతుందా అనేది ఇప్ప‌టికీ అనుమానంగానే ఉంది. సినిమా మ‌రీ స్లోగా ఉండ‌డంతో... రిపీట్ ఆడియ‌న్స్ ఉండ‌డం క‌ష్టం. తెలుగు సినిమాకి పెద్ద బ‌లం బీ, సీ ఆడియ‌న్స్‌. వాళ్ల‌కు ఈ సినిమా అంత‌గా న‌చ్చే అవ‌కాశం లేదు. బీ, సీల సపోర్ట్ ఏమాత్రం ఉన్నా.. మ‌హేష్ త‌న టార్గెట్ రీచ్ అవ్వ‌డం ఖాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.