English | Telugu

ఓ శ్రీ‌మంతుడు.. చాలా మైన‌స్‌లు

శ్రీ‌మంతుడు సినిమా విడుద‌లైంది. బెన్ ఫిట్ షో పూర్త‌యిన‌ప్ప‌టి నుంచీ ఈ సినిమాని ఆహో ఓహో అని పొగిడేస్తున్నారంతా. సినీ సెల‌బ్రెటీలూ ముందుకొచ్చి శ్రీ‌మంతుడు ఓ క్లాసిక్ అనే రేంజులో కీర్తిస్తున్నారు. స్టార్ హీరో అయ్యిండి, ఓ మంచి పాయింట్ ని న‌మ్మి, సినిమా చేసిన మ‌హేష్‌ని అభినందించాల్సిందే. క‌థ లోంచి ఎప్పుడూ ఎక్క‌డా ప‌క్క‌కు త‌ప్పుకోకుండా కేవ‌లం తాను చెప్ప‌ద‌ల‌చుకొన్న పాయింట్‌పైనే ఫోక‌స్ పెట్టిన ద‌ర్శ‌కుడినీ మెచ్చుకొని తీరాలి. కాస్త విశ్లేష‌ణాత్మ‌కంగా ఆలోచించి చూస్తే.. శ్రీ‌మంతుడులో బోలెడ‌న్ని మైన‌స్‌లు క‌నిపిస్తాయి.

* హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూ తిరిగే క‌థ ఇది. సినిమా మొత్తం అదే క‌నిపిస్తుంది. హీరో బిహేవియ‌ర్‌ని తెర‌పై చూపించ‌డానికి ద‌ర్శ‌కుడు స‌గం సినిమా మొత్తం వాడుకొన్నాడు. ఇంట్ర‌వెల్ ముందు వ‌ర‌కూ కూడా క‌థలోకి ప్ర‌వేశించ‌లేదు.

* దానం చేయ‌డం క‌థానాయ‌కుడిలోని ఉదాత్త‌మైన స్వ‌భావంగా తెర‌పై ఆవిష్క‌రించాడు దర్శ‌కుడు. ఓ సంద‌ర్భంలో రోడ్డుపై అడుక్కొంటున్న ముస‌ల‌మ్మ‌కు వేలకి వేలు దానం చేస్తాడు హీరో. ఇది మంచిత‌నానికి ప‌రాకాష్ట‌. ఎంత అంబానీ అయినా, బిల్‌గేట్స్ దిగొచ్చినా అడుక్కొనేవాళ్ల‌కు వేయి రూపాయ‌ల క‌ట్ట‌ల్ని దానం చేయ‌డు. ఈ సీన్ మ‌రీ టూమ‌చ్‌గా అనిపిస్తుంది.

* ఐ యామ్ వెరీ బ్యాడ్ స‌న్ అంటాడు ఓ సందర్భంలో మ‌హేష్ బాబు. తండ్రి ఆశ‌యాల్ని, ఆశ‌ల్ని ఏమాత్రం ప‌ట్టించుకోడు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం విచ్చ‌ల‌విడిగా దానం చేస్తుంటాడు.

* కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగికి రూ.20 ల‌క్ష‌లు ఇచ్చినందుకే.. జ‌గ‌ప‌తిబాబు సీరియ‌స్ గా డిస్కర్ష‌న్ పెడ‌తాడు. కానీ... ఊరుకెళ్లి త‌న త‌న‌యుడు కోట్లు కోట్లు ఖ‌ర్చు పెడుతున్నా ప‌ట్టించుకోడు.

* డ‌బ్బుకి క‌క్కుర్తి ప‌డి కొటేష‌న్ శ‌త్రువుల‌కు చేరేశాడ‌ని తెలిసినా.. రాహుల్ ర‌వీంద్ర‌న్‌కి కంపెనీ బాధ్య‌త‌లు అప్ప‌గించి వెళ్లిపోతాడు మ‌హేష్‌.

* సెకండాఫ్ మ‌రీ ల్యాగ్‌. స్లోగా న‌డుస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ మ‌రీ వీక్‌. ఆసుప‌త్రి సీన్ స‌రిగా పండ‌లేదు.

* వినోదానికి ఈ సినిమాలో్ ప్రాముఖ్య‌మే లేదు. అలీ, వెన్నెల కిషోర్‌ల చేత ఫోర్డ్స్ కామెడీ చేయించారు.

ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడ‌న్ని మైన‌స్ లు క‌నిపిస్తాయి. ఓ మంచి క‌థ, స్టార్ హీరో దొరికిన‌ప్పుడు ఈ మైన‌స్‌లు స‌ర‌వించుకొంటే మరింత‌ మంచి రిజ‌ల్ట్ వ‌చ్చేది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.