English | Telugu

జనతాగ్యారేజ్ ప్రొడ్యూసర్లకు షాక్ ఇచ్చిన పవన్..!

శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి, పెద్ద నిర్మాణసంస్థగా పేరు తెచ్చుకంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రొడక్షన్ నెం 2 గా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తోంది. తమ బ్యానర్ పై పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి వాళ్లిద్దరితో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చిందట ఈ సంస్థ. కానీ ఏమైందో ఏమో, పవన్ అండ్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా అడ్వాన్స్ తిరిగిచ్చేశారట. కారణాలేమిటో ఖచ్చితంగా తెలియనప్పటికీ, పవన్ సొంత బ్యానర్లోనే ఆ సినిమా చేయాలనుకోవడమే అందుక్కారణమని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ అండ్ పవన్ కాంబినేషన్లో మంచి క్రేజీ సినిమా మిస్సైంది శ్రీమంతుడు నిర్మాణ సంస్థ. ప్రస్తుతం పవన్ ఎస్.జే.సూర్య సినిమాపై దృష్టి సారించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ సినిమా ఉండబోతోందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.