English | Telugu

సినీపరిశ్రమలో ఆకస్మిక మరణాలపై హోమం

గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై తెలుగు సినీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. దీనిని చాలా సీరియస్ గా పరిగణించడంతో పాటు వెంటనే పరిహార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం పెద్దలంతా చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది కచ్చితంగా ఏదో దోషమే అని తేల్చి దానికి పరిహరించుకోవడానికి హోమం చేయాలని నిశ్చయించారు. వేద పండితుల సలహాతో చివరకు “పాశుపత మహా మృత్యుంజయ హోమం” చేయడానికి సిద్ధమయ్యారు. దీనిని స్వయంగా శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కీడు తొలగకపోతే ఇంకా ఇలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందని ఈనెలలోనే హోమం చేయాలని నిర్ణయించి దానికి మార్చి 23, 24, 25 తేదీలను సమయంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు నటుడు, ఎంపీ మురళీమనోహర్ ప్రకటించారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.