English | Telugu

స్టూడియోలో దొంగ‌లు ప‌డ్డారు

సెల‌బ్రెటీల ఇళ్ల‌లో, స్టూడియోలో దొంగ‌లు ప‌డుతున్నారు. పూరి ఇంట్లో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఇంట్లో దాదాపు రూ.15 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువులు మాయం అయ్యాయి. ఇప్పుడు అలాంటిదే మ‌రో ఘ‌ట‌న‌. జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో దొంగ‌లు ప‌డ్డారు. విలువైన షూటింగ్ సామాగ్రి మాయ‌మైంది. దాని విలువ దాదాపు రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. వెంట‌నే విష‌యాన్ని జూబ్లిహిల్స్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తీగ లాగితే డొంక క‌దిలింది. ఈ స్టూడియోలో ప‌ని చేస్తున్న న‌లుగురు వ‌ర్క‌ర్లు క‌ల‌సి... ప‌థ‌కం ప్ర‌కారం రోజూ కొన్ని వ‌స్తువులు మాయం చేస్తూ వ‌చ్చారు. చివ‌రికి దొరికి పోయారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.