English | Telugu

మన సినిమాల్లో శివయ్య

మహా శివుడు భక్త శుభంకరుడు, భోళా శంకరుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ మహేశ్వరుడు. ఆయన కరుణ కోసమే అందరి చూపులు. అందుకు మన తెలుగు సినిమాలు మినహాయింపు కాదు. అనేక సినిమాల్లో శంకరుడి పాత్రతో భక్తులను పరశింపచేయడానికి ప్రయత్నించారు. మహాశివరాత్రి సందర్భంగా మన తెలుగు తెరపై శివుళ్లు ఎవరో చూద్దాం రండి.

తెలుగు తెరపై తొలి శివుడు 1935లో కనబడ్డాడు. దాసరి కోటిరత్నం నిర్మించిన సతీ అనసూయ లో శివుడి పాత్ర ఉంది. అయితే ఆ పాత్ర ఎవరు చేశారనేది మాత్రం పెద్దగా తెలియలేదు


భక్తుడి ప్రేమను అర్ధం చేసుకున్న భక్త సులభుడి కథ. ఈ సినిమాలో పరమశివునిగా ఎం.బాలయ్య నటించారు. కన్నప్పగా కృష్ణంరాజు జీవించారు

దక్షయజ్ఞంలో ఎన్టీఆర్ చేసిన శివుని పాత్ర నభూతో నభవిష్యతి. క్లైమాక్స్ లో శివుని రుద్రతాండవం చూస్తే, రోమాలు నిక్కబొడవాల్సిందే. ఉమాచండీ గౌరీశంకరుల కథ సినిమాలో కూడా ఎన్టీఆర్ శివుడిగా మెప్పించారు.

మాస్ హీరో అయ్యుండి, పరమశివుని పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో చిరును ఎవరూ కొట్టలేరేమో. కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైంలో కూడా మంజునాథలో పరమశివునిగా అద్భుతనటనను కనబర్చారు. అంతకు ముందు ఆపద్బాంధవుడు, పార్వతీ పరమేశ్వరులు సినిమాల్లో శివుడి పాత్ర వేసుకున్నారు మెగాస్టార్

నాగార్జున హీరోగా వచ్చిన ఢమరుకం సినిమా కూడా శివనేపథ్యమే. నాస్తికుడిగా నాగార్జున, శివుడిగా ప్రకాష్ రాజ్ నటించారు.

ఇప్పుడున్న హీరోల్లో, శివుడి పాత్ర అద్భుతంగా సెట్ అయ్యేది ప్రభాస్ కే అనేది సినీజనాల మాట. మిగిలిన హీరోల్లో ఎంత మందికి మహాశివుని పాత్ర సరిపోతుందో పక్కన పెడితే, వారిలో ఆ పాత్రను రక్తి కట్టించగలిగేవారెందరుంటారో చెప్పడం కష్టమే. పౌర్ణమి సినిమాలో క్లైమాక్స్ సాంగ్ లో, శివుడి పాట వస్తున్నప్పుడు, రౌడీలతో ఫైటింగ్ చేస్తాడు ప్రభాస్. ఇక బాహుబలి సినిమాలో లింగాన్ని మోస్తూ, శివుడు అనే పేరుతో పాత్రలో జీవించాడు. త్వరలోనే భక్త కన్నప్పతోనో, లేక మరో సినిమాలోనో శివుడి పాత్రధారిగా ప్రభాస్ వస్తే ఆశ్చర్యం లేదు.

అందరికీ పరమశివుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.